Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఇటీవలే టీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డి శాసనమండలిలో అడుగుపెట్టబోతున్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కోసం కౌశిక్ రెడ్డి పేరును రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కు సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు గవర్నర్ తమిళిసై ఆమోదముద్ర వేశారు. దీంతో, త్వరలోనే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవలే కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ టికెట్ తనకు వస్తుందని కౌశిక్ రెడ్డి ఆశించారు. అయితే, ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.