Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంగారెడ్డి : జిల్లాలోని న్యాల్కల్ మండలంలో నకిలీ నోట్ల చలామణి స్థానికంగా కలకలం రేపింది. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్కు చెందిన కొందరు వ్యక్తులు ఆదివారం సాయంత్రం బసంతపూర్, కల్ బేమల్, మెటల్ కుంట కిరాణా షాపులు స్వీట్ హౌస్ లలో నకిలీ వంద రూపాయల నోట్లతో పలు వస్తువులను కొనుగోలు చేశారు. మెటల్ కుంట గ్రామంలో నకిలీ నోట్లతో కిరాణా షాపుల్లో వస్తువులు కొనుగోలు చేస్తుండగా దుకాణం వ్యాపారి నకిలీ నోట్లను గుర్తించి వెంటనే అప్రమత్తమై వారిని గ్రామస్తుల సహకారంతో పట్టుకునేందుకు ప్రయత్నించగా ఓ బాలుడు (16) పట్టుబడ్డాడు. మరో ఇద్దరు పరారయ్యారు. వెంటనే హద్నూర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పట్టుబడ్డ బాలుడు తోపాటు ఏడు వందల రూపాయల నకిలీ నోట్లతో పాటు సెల్ఫోన్, ఆటను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.