Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణకు రూ.38,114 కోట్ల 'ముద్ర' రుణాలు మంజూరు అయ్యాయి. 47.26 లక్షల ఖాతాల్లోకి నిధులు జమ కానున్నాయి. ప్రధాన మంత్రి ముద్ర యోజను ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు గత ఆరేళ్లలో మొత్తం 47,26,819 మంది ఖాతాలకు రూ.38,114 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. వీటిలో 37,46,740 మంది రూ.50 వేలలోపు (శిశు పథకం) రుణాలు, అలాగే రూ.5 లక్షల లోపు (కిషోర్ పథకం) రుణాలు , 7,94,193 మంది, రూ.10 లక్షలలోపు (తరుణ్ పథకం) రుణాలు తీసుకున్న వారి సంఖ్య 1,85886 మంది ఉన్నట్లు వివరించారు.