Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగు బైక్ లు సీజ్
నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ సబ్ డివిజన్ పరిదిలో ఈ ఏడాది కాలంలో జరిగిన బైక్ దోంగతనాల కేసును పోలీసులు చేదించారు. ముగ్గురు దొంగలను పట్టుకుని నాలుగు బైక్ లను రికవరి చేసినట్లు నిజామబాద్ ఎసిపి వేంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం నిజామాబాద్ ఎసిపి కార్యాలయంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా ఎసిపి మాట్లాడుతు... గత నెల 15న మిర్చి కంపౌండ్ లో నవత ట్రాన్స్ పోర్టు ముందు నుంచి ప్రసాద్ అనే వ్యక్తికి చెందిన బైక్ చోరికి గురైంది.బాధితుడి పిర్యాదు మేరకు ఓకటవ టౌన్ పోలిస్ లు కేసు నమోదు చేశారు. అదివారం రాత్రి నవిపేట్ మండల కేంద్రంలోని సుభాష్ నగర్ కు చెందిన సలీల్ అలియాస్ భగత్, నవిపేట్ మండలం లింగమయ్య గుట్ట ప్రాంతానికి చెందిన ద్యారంగుల గణేష్, కమటం గంగాధర్ లు ఎలాంటి పత్రాలు లేని బైక్ లపై వేలుతుడంగా పోలిస్ లు పట్టుకుని విచారించారు. వారిని విచారించగా ఎడాధి కాలంలో నాలుగు బైక్ లను చోరి చేసినట్టు ఓప్పుకోవడంతో వారి వద్ధనుంచి బైక్ లను స్వాధినం చేసుకుని ముగ్గురిని రిమాండ్ పంపినట్లు ఎసిపి తెలిపారు. బైక్ దోంగతనాల కేసను చెదించిన ఓకటవ టౌన్ ఎస్ హెచ్ఓ అంజనేయులు, ఎస్ఐ నర్సింలు, ఎఎస్ఐ షకిల్ పాషా, కానిస్టెబులఖ వంశీ మనోహర్, రమేష్ , గైని సాయన్నలను అభినందించారు.