Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : గుంటూరు జిల్లా వినుకొండలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లికి పెద్దలు అంగీకరించలేదన్న మనస్తాపంతో రైలు కిందపడి ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. మృతులను ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం శతకొడు గ్రామానికి చెందిన యువతి, యువకుడిగా పోలీసులు గుర్తించారు. శతకొడు గ్రామానికి చెందిన ఆదంవలీ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదంవలీకి ఇటీవల పెద్దలు వివాహం నిశ్చయించడంతో నాలుగు రోజుల క్రితం ప్రేమించిన యువతితో పారిపోయాడు. ఇవాళ వినుకొండ సమీపంలో రైలు కిందపడి ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.