Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన లక్ష రూపాయల రైతు రుణమాఫీ హామీని దశల వారీగా అమలు చేసేందుకే కేబినెట్ మొగ్గుచూపింది. రూ. 50 వేల వరకు ఉన్న క్రాప్ లోన్లను ఈ నెల 15 నుంచి నెలాఖరు వరకు మాఫీ చేయాలని ఆర్థికశాఖను ఆదేశించింది. ఈ నిర్ణయంతో 6 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందుతారని తెలిపింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్లో కేబినెట్ సమావేశమైంది. రైతు రుణమాఫీ, పెన్షన్లు, వ్యవసాయం, కరోనా, దళిత బంధు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భారం పడటంతోనే రెండేండ్లుగా రూ. 25 వేల వరకు రైతు రుణాలు మాత్రమే మాఫీ చేశామని, దీనిద్వారా 3 లక్షల మందికి లబ్ధి చేకూర్చామని కేబినెట్లో ప్రకటించారు. రూ. 50 వేల వరకు ఉన్న రుణాలను పంద్రాగస్టు నుంచి మాఫీ చేయనున్నట్లు తెలిపారు. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లల వివరాలు తెప్పించాలని హెల్త్ సెక్రటరీకి కేబినెట్ సూచించింది.