Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజైన మంగళవారమూ లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా డెల్టా కేసులు పెరుగుతుండడం అంతర్జాతీయ సూచీలను కలవరపెడుతోంది. అమెరికా మార్కెట్లు సోమవారం అప్రమత్తంగా కదలాడాయి. నేడు ఆసియా మార్కెట్లు సైతం ఆచితూచి పయనిస్తున్నాయి. కానీ, త్రైమాసిక ఫలితాలు బలంగా ఉండడం, తయారీ కార్యకలాపాలు పుంజుకోవడం దేశీయ సూచీలకు దన్నుగా నిలుస్తోంది. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 238 పాయింట్ల లాభంతో 53,182 వద్ద.. నిఫ్టీ 57 పాయింట్లు లాభపడి 15,940 వద్ద కొనసాగుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.33 వద్ద ట్రేడవుతోంది.