Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: గోదావరి, కృష్ణా బోర్డుల సంయుక్త సమన్వయ కమిటీ భేటీ జరగనుంది. మంగళవారం ఉదయం 11:30 గంటలకు జలసౌధలో ఈ సమావేశం జరగనుంది. ప్రధానంగా గోదావరి, కృష్ణా నదులకు సంబంధించి పరిధిలపై చర్చ జరగనుంది. బోర్డులకు పూర్తిస్థాయిలో అధికారాలు కేటాయిస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ భేటిలో రెండు రాష్ట్రాల ఈఎన్సీలు, కేంద్ర జలశక్తి, ట్రాన్స్కో, జెన్కో అధికారులు పాల్గొంటారు. వారం రోజుల క్రితం భేటీ కావాలని గోదావరి బోర్డు లేఖ రాసింది. సమన్వయ భేటీ కాకుండా బోర్డు పూర్తి స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిన్న(సోమవారం) తెలంగాణ ఈఎన్సీ లేఖ రాసింది. పూర్తి స్థాయి భేటీ అయితే అన్ని అంశాలపై చర్చించవచ్చని కోరింది. గోదావరి బోర్డు మాత్రం వాయిదాకు ససేమిరా అంటూ.. మీటింగ్ ఖచ్చితంగా ఉంటుందని స్పష్టం చేసింది. బోర్డు పూర్తి స్థాయి మీటింగ్ కూడా త్వరలో ఉంటుందంటూ లేఖలో పేర్కొంది.