Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: గెలుపు ఓటమిలు జీవితంలో ఒక భాగమని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఉదయం ఒక ట్వీట్లో అన్నారు. టోక్యో ఒలంపిక్స్లో భారత పురుషుల జట్టు సెమీ ఫైనల్ మ్యాచ్లో బెల్జియం చేతిలో పరాజయం పాలైంది. పసిడి పతకం ఆశలు గల్లంతైనా, కాంస్యం కోసం రెండో సెమీస్లో ఓడిన జట్టుతో భారత్ తలపడాల్సి ఉంది. భారత హాకీ జట్టు చెక్కుచెదరని క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని మోడీ ఆశిస్తూ తాజా ట్వీట్ చేశారు. ''జీవితంలో గెలుపు, ఓటమిలు ఒక భాగం. టోక్యో-2020 ఒలంపిక్స్లో మన హాకీ జట్టు శక్తివంచ లేకుండా ఆడారు. అదే లెక్కలోకి వస్తుంది. తదుపరి మ్యాచ్తో పాటు భవిష్యత్లోనూ ఎన్నో విజయాలు సాధించాలని ఆశిస్తున్నారు. మన ఆటగాళ్లను చూసి దేశం గర్విస్తోంది'' అని ప్రధాని ఆ ట్వీట్లో భారత్ హాకీ టీమ్ను ఉత్సాహపరిచారు.