Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ: సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు మంగళవారం వెల్లడి కానున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు సీబీఎస్ఈ బోర్డు వెల్లడించింది. ఈ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్సైట్లు cbseresults.nic.in, cbse.nic.inలతో పాటు డిజిలాకర్ యాప్లోనూ తెలుసుకోవచ్చు. ఫలితాలు పొందేందుకు విద్యార్థులు తమ రోల్ నంబర్తో పాటు స్కూల్ నంబర్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా ఈ ఏడాది కూడా సీబీఎస్ఈ 10, 12 తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. గతవారం 12వ తరగతి ఫలితాలను విడుదల చేయగా.. రికార్డు స్థాయిలో 99.37శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.