Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఓ తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తల్లి మృతి చెందగా ఇద్దరు కూతుళ్ల పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి మండలంలోని సోమర్యాగడి తండాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివారల ప్రకారం.. తల్లి హన్సీ కుటుంబ కలహాలతో తన ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి, అలాగే తానూ విషం తీసుకుంది. దాంతో తల్లి మరణించగా వెంటనే గమనించిన స్థానికులు పిల్లలని కామారెడ్డిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.