Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సమాజంలో వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. వావివరసలు మరిచిపోతున్నారు. అవి కొన్నిసార్లు ఆత్మహత్యలకు దారి తీస్తుండగా కొన్ని సార్లు హత్యలకూ దారి తీస్తున్నాయి. తాజాగా కోడలితో మామా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అనంతరం తనకు తన సంబంధానికి కొడుకు అడ్డుగా ఉన్నాడని భావించి అతన్ని హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలో చోటు చేసుకుంది.
అద్దంకి సీఐ రాజేష్, ఎస్సై వి.శివన్నారాయణ, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏల్చూరు ఎస్సీ కాలనీకి చెందిన కరుణయ్య, మరియమ్మ భార్యాభర్తలు. అయితే మరియమ్మ 30 ఏండ్ల కిందటే చనిపోయింది. వారికి కుమారుడు లక్ష్మయ్య (35) ఉన్నాడు. అతనికి 18 ఏండ్ల క్రితం గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన సునీతతో వివాహమైంది. వారికి ఇద్దరు మగ పిల్లలున్నారు. ఇదిలా ఉండగా మామ కరుణయ్య తన కోడలు సునీతతో వివాహేతర సంబంధం పెట్టుకన్నాడు. లక్ష్మయ్య మద్యానికి బానిసై అది పట్టించుకునేవాడు కాదు. అయితే తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని లక్ష్మయ్యను హత్య చేసేందుకు మామా, కోడలు పథకం పన్నారు. ఆదివారం అర్ధరాత్రి దాటాక గాఢనిద్రలో ఉన్న లక్ష్మయ్యపై మారణాయుధాలతో దాడి చేసి చంపారు. ఈ దారుణాన్ని మృతుడి పెద్ద కుమారుడు చూశాడు. అనంతరం నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.