Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: గత కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తున్నా సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. విద్యార్థులు http://cbseresults.nic.in/, https://www.cbse.gov.in/, వెబ్ సైట్లలో ఫలితాలు చూసుకోవచ్చు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సీబీఎస్ఈ టెన్త్, 12వ తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో విద్యార్థులు ఇంటర్నల్ అసెస్మెంట్, అర్ధ సంవత్సరం లేదా మధ్యంతర పరీక్షలు, ప్రీ-బోర్డ్ పరీక్షలలో పనితీరు ఆధారంగా విద్యార్థులకు మార్కులు కేటాయించారు. వాస్తవానికి జులై 20న ఫలితాలను విడుదల చేయాల్సి ఉంది. కానీ పాఠశాలలు విద్యార్థుల మార్కులకు సంబంధించిన జాబితాను పంపించడంలో ఆలస్యం చేయడంతో ఫలితాల విడుదలను అధికారులు వాయిదా వేశారు.