Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రపంచ అత్యుత్తమ విద్యార్థిగా భారతీయ అమెరికన్ ఎంపికైంది. అమెరికాలోని ప్రముఖ జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ఈ మేరకు 11 ఏండ్ల నటాషా పెరీని ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యార్థుల్లో ఒకరిగా ప్రకటించింది. జాన్ హాప్కిన్స్ నిర్వహించిన సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ టాలెంట్ సెర్చ్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన నటాషాను ఈ మేరకు సత్కరించింది. జాన్ హాప్కిన్స్ ఏటా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులలోని సామర్థ్యాలను గుర్తించి.. వారిని ప్రోత్సహించడానికి ఈ పరీక్షను నిర్వహిస్తుంది. 2020-21 సంవత్సరానికి గాను నిర్వహించిన టాలెంట్ సెర్చ్లో 84 దేశాల నుంచి సుమారు 19 వేల మంది ఈ పరీక్షల్లో పాల్గొన్నారు. ఐద తరగతి చదువుతున్న నటాషా ఎనిమిదో తరగతి విద్యార్థులతో సమానంగా పరీక్షల్లో 90 శాతం మార్కులతో పైచేయి సాధించింది.