Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కృష్ణా, గోదావరి బోర్డుల సమన్వయ కమిటీ భేటీ కాసేపటి క్రితం జలసౌధలో ప్రారంభమైంది. అయితే, తెలంగాణకు చెందిన ట్రాన్స్కో, జెన్కో అధికారులు మాత్రం సమావేశానికి రాలేదు. మరవైపు ఏపీ నుంచి ఇరిగేషన్ ఈఎన్సీలు, ట్రాన్స్కో, జెన్కో సీఎండీలు, బోర్డు మెంబర్లు హాజరయ్యారు. పూర్తి స్థాయి బోర్డు మీటింగ్లు నిర్వహించాలని తెలంగాణ డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు సోమవారం జీఆర్ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ లేఖ రాసింది. ఈరోజు కృష్ణా బోర్డు చైర్మెన్కు కూడా పూర్తి స్థాయి బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ఇరిగేషన్ అధికారులు లేఖ రాశారు.