Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అండమాన్ నికోబార్ దీవుల్లో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. మూడు గంటల వ్యవధిలో నాలుగుసార్లు భూమి కంపించడంతో ప్రజలు భయభాంత్రులకు గురయ్యారు. మొదట ఉదయం 6.27 గంటల సమయంలో రిక్టర్ స్కేల్పై 4.3 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. క్యాంప్బెల్ బేకు 235 కిలోమీటర్ల దూరంలో, భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు పేర్కొంది. ఆ తర్వాత 7: 21 గంటలకు రిక్టర్ స్కేల్పై 4.6 తీవ్రతతో భూమి కంపించింది. అనంతరం మరోసారి ఉదయం 9.12 గంటలకు రిక్టర్ స్కేల్పై 6.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. భూమికి 40 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు ఎస్సీఎస్ తెలిపింది. అనంతరం 9.13 గంటలకు మరోసారి రిక్టర్ స్కేల్పై 5.9 తీవ్రతతో భూమి కంపించింది.