Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఒలింపిక్స్లో అత్యంత అరుదైన ఘటన నమోదైంది. ఒకే ఈవెంట్ లో ఇద్దరికి బంగారు పతకాలు లభించాయి. పురుషుల హైజంప్ లో భాగంగా ఖతర్కు చెందిన ఇసా ముతజ్ బార్షిమ్, ఇటలీ అథ్లెట్ గ్లాన్మార్కో టంబెరిలిద్దరూ 2.37 మీటర్ల ఎత్తుకు ఎగిరారు. దాంతో ఇద్దరినీ విజేతలుగా ప్రకటించారు. మరో అథ్లెట్ మాక్సిమ్ నెడసెకవు కూడా 2.37 మీటర్లు జంప్ చేసినప్పటికీ అతని 8 ప్రయత్నాల్లో ఒక ఫౌల్ ఉంది. దాంతో అతనికి కాంస్యం లభించింది. గతంలో 1908 ఒలింపిక్స్ పోల్ వాల్ట్లో ఇలాగే బంగారు పతకాన్ని ఇద్దరు పంచుకున్నారు.