Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో భారీగా నల్ల బెల్లం పట్టుబడింది. ఏపీలోని నెల్లూరు నుంచి మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడకు అక్రమంగా తరలిస్తున్న120 క్వింటాళ్ల నల్ల బెల్లం, నాలుగు క్వింటాళ్ల పటిక, మూడు భారీ వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. బెల్లం విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని ఎస్పీ కోటి రెడ్డి తెలిపారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.