Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కరోనా చికిత్సకు ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఆనందయ్య తయారు చేసిన మందుకు ఏపీ ఆయుష్ శాఖ సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చిందని అనందయ్య తరఫు న్యాయవాది ఎన్ అశ్వనీకుమార్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తెలిపారు. కొవిడ్ కు తాను తయారు చేసిన ఆయుర్వేద మందుల పంపిణీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోకుండా అధికారులను నిలువరించాలని కోరుతూ ఆనందయ్య హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అనందయ్య తరఫు న్యాయవాది మాట్లాడుతూ ఆనందయ్య మందుకు ఏపీ ఆయుష్ శాఖ సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చిందని తెలిపారు. అయితే మందుకు పేరును ఖరారు చేయాల్సి ఉందన్నారు. కంటిచుక్కల మందుకు కూడా ఆమోదం ఇచ్చే అంశంపై జరుగుతున్న చర్చల్లో పురోగతి ఉందన్నారు. విచారణను వాయిదా వేయాలని కోరారు. అందుకు అంగీకరించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.