Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : 2031 తర్వాతే తెలుగు రాష్ట్రాల నియోజకవర్గాల పునర్విభజన అని పార్మమెంట్ లో కేంద్రం స్పష్టం చేసింది. మంగళవారం లోక్ సభలో రేవంత్రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయమంత్రి నిత్యానంద రాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి మంగళవారం లోక్సభలో మాట్లాడుతూ 'ఏపీ విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 నియోజకవర్గాలను 153 నియోజకవర్గాలుగా పెంచాల్సిన అవరం ఉంది.. ఎప్పుడు పెంచుతారు?` అంటూ ప్రశ్నించారు. అందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సమాధానం ఇస్తూ రాజ్యంగంలోని ఆర్టికల్ 170లో చెప్పినట్టు 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ఆధారంగా రాజ్యాంగంలోని 170 అధికరణం ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని తెలిపారు.