Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : జమ్ముకశ్మీర్లో అనుమానిత మళ్లీ డ్రోన్ సంచారం కలకలం రేగింది. సోమవారం రాత్రి.. సాంబా జిల్లాలో మరో అనుమానిత డ్రోన్ కదలికను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులను అప్రమత్తం చేసినట్టు ఓ అధికారి చెప్పారు. అంతకుముందు రోజు కూడా అర్ధరాత్రి సాంబా జిల్లాలో మూడు ప్రాంతాల్లో డ్రోన్లను గుర్తించినట్లు వివరించారు. డ్రోన్ల ద్వారా ఆయుధాలు, ఐఈడీలు, మాదకద్రవ్యాలను చేరవేయడం వెనుక పాకిస్థాన్కు చెందిన లష్కరే తొయిబా, జైషే ఉగ్ర సంస్థలు ఉన్నాయని డీజీపీ దిల్బాగ్ సింగ్ వెల్లడించారు. దాంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు.. యాంటీ డ్రోన్ చర్యలను ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు.