Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్ -ఇంగ్లండ్ మధ్య 5 టెస్టుల సిరీస్ బుధవారం ప్రారంభం కానుంది. రేపు జరిగే మ్యాచ్ తో భారత్ 2021-2023 టెస్టు చాంపియన్ షిప్ లో మొదటి మ్యాచ్ ఆడనుంది. ఇదిలా ఉండగా ఇరుజట్లు తమ గత మ్యాచ్లలో న్యూజిలాండ్ చేతిలో ఓటమి చవి చూడడంతో రెండు జట్లు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తాయనడంతో సందేహం లేదు. ఇక ఈ ఏడాది భారత పర్యటనలో భాగంగా భారత్ చేతిలో ఇంగ్లాండ్ ఓటమి పాలై 3-1 తేడాతో సిరీస్ను చేజార్చుకున్న విషయం తెలిసిందే.
షెడ్యూల్ ఇదే..
భారత కాలమానం ప్రకారం అన్ని మ్యాచ్లు మధ్యాహ్నం 3:30 నిమిషాలకు ప్రారంభమవుతాయి
మొదటి టెస్టు: ఆగష్టు 4- 8, నాటింగ్ హాం, ట్రెంట్ బ్రిడ్జి మైదానం
రెండో టెస్టు: ఆగష్టు 12- 16, లండన్, లార్డ్స్ మైదానం
మూడో టెస్టు: ఆగష్టు 25- 29, లీడ్స్, హెడింగ్లీ మైదానం
నాలుగో టెస్టు: సెప్టెంబరు 2-6, లండన్, ఓవల్ మైదానం
ఐదో టెస్టు: సెప్టెంబరు 10-1, మాంచెస్టర్, ఎమిరేట్స్ ఓల్డ్ ట్రఫోర్ట్