Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఒలింపిక్స్లో పాల్గొన్న అథ్లెట్లను ప్రత్యేక అతిథులుగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఎర్రకోటకు ప్రధాని మోడీ ఆహ్వానించనున్నారు. ఆ సమయంలో వారందరితో వ్యక్తిగతంగా మోడీ భేటీకానున్నట్టు సమాచారం. అయితే సుమారు 127 మంది అథ్లెట్లు వివిధ ఈవెంట్లలో పాల్గొంటున్నారు. వీరితో పాటు వంద మంది కోచ్లు, అసిస్టెంట్ సిబ్బంది ఉన్నారు. అయితే మంగళశారం ప్రధాని మోడీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈసారి భారీ సంఖ్యలో భారత బృందాన్ని ఒలింపిక్స్ పంపినట్టు చెప్పారు. అనేక క్రీడల్లో మొదటిసారి క్వాలిఫై అయ్యామని, గట్టి పోటీ ఇస్తున్నామని తెలిపారు. భారతీయ క్రీడాకారులు ఆత్మవిశ్వాసం, దీక్ష, ఉత్సాహం చాలా ఉన్నతంగా ఉన్నట్లు తెలిపారు. సరైన ట్యాలెంట్ను గుర్తించి, ప్రోత్సహిస్తే ఇలాంటి ఆత్మవిశ్వాసం కనిపిస్తుందని ఆయన అన్నారు.