Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణలో బుధవారం నుంచి ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. ఇంజనీరింగ్కు సంబంధించి 4,5,6 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. అలాగే వ్యవసాయ, మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలు 9,10 తేదీల్లో జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, సాయంత్రం 3 గంటల నుంచి 6 వరకు పరీక్షలు జరుగునున్నాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఇందు కోసం తెలంగాణ వ్యాప్తంగా 82 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏపీలో 23 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉండగా పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు చెప్పారు. రెండు గంటల ముందుగానే పరీక్ష కేంద్రం లోపలికి అనుమతిస్తామన్నారు. హాల్ టికెట్లపై పరీక్ష కేంద్రం లొకేషన్ ఉంటుందని చెప్పారు. ఒక రోజు ముందుగానే టెస్ట్ సెంటర్ తెలుసుకోవాలని చెప్పారు.