Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : హస్వంత్, నమ్రత లీడ్ రోల్ లో యుగంధర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఇప్పుడు కాక ఇంకెప్పుడు`. ఈ చిత్రయూనిట్ పై నగర సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్లో హీరో హీరోయిన లకు సంబంధించిన రోమాంటిక్ సన్నివేశంలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్గా ఓ భక్తి గీతాన్ని వినిపించారు. దీనిపై పలువురు సోషల్మీడియాలో అభ్యంతరం తెలిపారు. టీజర్ ను పరిశీలించిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు..అందులో ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసే సన్నివేశం ఉన్నట్టు గుర్తించారు. దాంతో చిత్ర యూనిట్పై వారు సుమోటోగా కేసు నమోదు చేశారు.