Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మహిళలు ఏ స్థాయిలో ఉన్నా వారిపై దాడులు ఆగడం లేదు. తాజాగా ఓ దళిత మహిళ ట్రైనీ ఎస్సై పై మరిపెడ ఎస్సై లైంగికదాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలు మహబూబాబాద్ జిల్లా మరిపెడలో వెలువెత్తుతున్నాయి. దాంతో ఎస్సైను అరెస్టు చేయాలని ఎస్పీని వరంగల్ సీపీ తరుణ్జోషి ఆదేశించారు.
సోమవారం రాత్రి మరిపెడ ఎస్సై శ్రీనివాస్ రెడ్డి తనను అడవిలోకి తీసుకెళ్లి తనపై లైంగికదాడి చేశాడని దళిత ట్రైనీ ఎస్ఐ ఆరోపిస్తోంది. బుధవారం తన కుటుంబ సభ్యులతో కలిసి సీపీ కార్యాలయానికి బాధితురాలు వచ్చి ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం జరగకుంటే ఉద్యోగానికి రాజీనామా చేస్తానని చెప్పింది. దాంతో ఎస్ఐ శ్రీనివాస్రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మహబూబాబాద్ ఎస్పీని వరంగల్ సీపీ తరుణ్జోషి ఆదేశించారు.