Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సికింద్రాబాద్లోని రాష్ట్రపతి రోడ్లో అధునాతన హంగులతో నూతనంగా నిర్మించిన మహంకాళీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను మంగళవారం హోంమంత్రి మహమూద్అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్లు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ తెలంగాణలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయని, దీనికి కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. నగరంలో ఏర్పాటుచేసిన ట్రాఫిక్ ఆటోమేటిక్ సిస్టం మంచి ఫలితాలను ఇస్తున్నదన్నారు ఇటీవల నగరంలో జరిగిన బోనాల జాతర విజయవంతంగా నిర్వహించడానికి లా అండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులతో పాటు షీటీం కూడా సమర్ధవంతంగా పని చేసిందని ప్రశంసించారు.