Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్,స్కాలర్ షిప్ లనూ విడుదల చేయాలి ఎస్ఎఫ్ఐ రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా అప్లై చేసుకున్న 15 లక్షల మంది విద్యార్థులకు దాదాపు 3 వేల కోట్ల రూపాయల వరకు పెండింగ్ లో పెట్టింది.ఈ బకాయిలు విడుదల చేయాలని కోరారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆశోక్ రెడ్డి, కార్యదర్శి జావిద్ మాట్లాడుతూ. విడుదల చేయకపోవడం వల్ల లక్షలది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. చాలామంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ మిదనే ఆధార పడి చదువులు చదువుకుంటున్నరాని ఈ సంవత్సరం బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు ఫీజులు కట్టమని ఒత్తిడి చేస్తు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. చదువు అయిపోయిన విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వమని అడిగితే మొత్తం ఫీజు కడితేనే ఇస్తామని ఇబ్బందులు పడుతున్నారూ. ఒక వైపు కరోనా లాక్ డౌన్ వల్ల చాలామంది కుటుంబాలు చిన్న భిన్నం అయి ఉపాధి లేక కుటుంబ పోషణ కుడా ఇబ్బందులు ఉన్న సమయంలో ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థుల చదువులు మధ్యలోనే ఆగే ప్రమాదం ఉంది కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా,రాష్ట్ర వాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.