Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 1546 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 1940 మంది కోలుకున్నారు. ఇన్ఫెక్షన్ కారణంగా 18 మంది మృతి చెందారు. ఏపీలో మొత్తం పాజిటివ్ కేసులు 19,71,554కు పెరిగాయి. ఇవాళ్టి వరకు మొత్తం 19,37,956 మంది కోలుకున్నారు. ఇంకా 20,170 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మరణాలు 13,428కి చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 69,606 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.