Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : హుజురాబాద్ టీఆర్ఎస్ క్యాండిడేట్ పై సీఎం కేసీఆర్ ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. బీసీ అభ్యర్థినే బరిలో దింపాలని డిసైడ్ అయినట్లు సమాచారం. సర్వేలు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తర్వాతే అభ్యర్థిని కన్ఫామ్ చేసినట్లు టాక్. కేసీఆర్ లిస్టులో చాలామంది పేర్లు ఉన్నట్లు వినబడ్డా.. టీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ కే టికెట్ ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. గెల్లు శ్రీనివాస్ తో పాటు.. ఈ మధ్యనే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన స్వర్గం రవి, జమ్మికుంట స్థానిక లీడర్ వీరేశం, వకుళాభరణం కృష్ణమోహన్ పేర్లు పరిశీలించినా.. గెల్లుకే ఇవ్వాలని సీఎం కేసీఆర్ డిసైడ్ చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.