Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు మండలం సుబ్బరాజు పేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పండూరి గౌరీదేవి అనే మహిళపై బలగం సత్యనారాయణ అలియాస్ బాబ్జీ అనే వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. గౌరీదేవి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివాహేతర సంబంధం వలన వచ్చిన మనస్పర్థలతో హత్యాయత్నం చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.