Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు బుధవారం ఛలో ప్రగతి భవన్కు పిలుపునిచ్చారు. 6 నెలలుగా బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తుందంటూ కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నో పేమెంట్.. నో వర్క్ నినాదంతో సిటీలో పనులను నిలిపివేసినట్లు బల్దియా కాంట్రాక్టర్లు తెలిపారు. గ్రేటర్ పరిధిలో గత ఆరు నెలలుగా పనులు చేసిన కాంట్రాక్టర్లకు జీహెచ్ఎంసీ పైసా కూడా చెల్లించలేదు. రహదారుల నిర్మాణం, నిర్వహణకు సంబంధించి రూ.600-650 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చిన కాంట్రాక్టర్లు.. బిల్లులు చెల్లించే వరకు పనులు చేయబోమని ఇటీవల తేల్చి చెప్పారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనుల బిల్లులు రూ.800 కోట్ల వరకు పెండింగ్లో ఉన్నాయి. ఇతర పనులకు సంబంధించిన బిల్లుల బకాయి రూ.150 కోట్ల వరకు ఉంది.