Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిజామాబాద్: జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలో తెగిపడిన చేయి ఉండటం కలకలం రేగింది. మార్చురీ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ప్లాస్టిక్ కవర్లో పాడేసి వెళ్లిపోయారు. ఈ ఘటనతో ప్రభుత్వ ఆసుపత్రి కి వచ్చిన రోగులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. నిన్న కంటేశ్వర్ బైపాస్ రోడ్లో రోడ్డు ప్రమాదంలో మరణించిన ఓ వ్యక్తి చేయిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా ఎవరు వ్యవహరించారనే కోణంలో పోలీసుల విచారణ జరుపుతున్నారు.