Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఆర్థిక నేరాల నుంచి తప్పించుకునేందుకే ప్రధాని మోడీకి కేసీఆర్ లొంగిపోయారని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఆరోపించారు. మోడీ ప్రజావ్యతిరేక విధానాలపై కేసీఆర్, టీఆర్ఎస్ ఎంపీలు మాట్లాడటంలేదన్నారు. దీంతోనే కేసీఆర్ ఎవరి పక్షమో తేలిపోయిందన్నారు. కేసీఆర్ ఒత్తిడివల్లే పాదయాత్రను బండి సంజయ్ వాయిదా వేసుకున్నారని రేవంత్ పేర్కొన్నారు.