Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశాఖ: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటన నక్కపల్లి మండలం ఉదండపురం జాతీయ రహదారిపై జరిగింది. తలుపులమ్మలోవ అమ్మవారి దర్శనానికి భార్యాభర్తలు, వదిన, ఐదు నెలల చిన్నారి వెళ్లివస్తున్నారు. నక్కపల్లి మండలం ఉదండపురం జంక్షన్ జాతీయ రహదారిపై డివైడర్ను బైక్ ఢీకొట్టింది. డివైడర్ను ఢీకొట్టి అవతలి రోడ్డుపై పడటంతో దుర్గ, కామేశ్వరిపై వ్యాన్ వెళ్లింది. దీంతో దుర్గ, కామేశ్వరి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. భర్త రాజ్కి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.