Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: అనారోగ్యంతో బాధపడుతూ బొల్లారం మున్సిపల్ కౌన్సిలర్ ప్రమీలగౌడ్ (45) మంగళవారం తన నివాసంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఆమె బొల్లారంలో స్థిరపడ్డారు. కాగా గతంలో ఎంపీటీసీగా పనిచేసిన ఆమె ఏడాదిన్నర క్రితం టీఆర్ఎస్ అభ్యర్థిగా 11వ వార్డు నుంచి మున్సిపల్ కౌన్సిలర్గా గెలుపొందారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుందని, ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డట్లు స్థానికులు, కుటుంబీకులు తెలిపారు. ఆమె ఆత్మహత్యతో స్థానికంగా విషాదం నెలకొన్నది. కౌన్సిలర్ చంద్రారెడ్డి, మాజీ జడ్పీటీసీ బాల్రెడ్డి కుటుంబసభ్యులను ఓదార్చారు. సీఐ ప్రశాంత్ ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.