Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: పలు స్టార్ హోటల్స్లో ఇటీవల జరిగిన సంచలనాల సంఘటనల దృష్ట్యా మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మంగళవారం మాదాపూర్ డీసీపీ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో స్టార్ హోటల్స్ నిర్వాహకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి కొన్ని మార్గదర్శకాలను సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు అనుమానితుల గుర్తింపుపై పోలీసులు పలు సూచనలు చేశారు.
- 30 రోజుల డాటా నిల్వ ఉండే సామర్థ్యంతో కూడిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి.
- లాబీల్లో కాకుండా హోటల్లోని ప్రతి గది ప్రధాన ద్వారం కనిపించే విధంగా సీసీ కెమెరాలు ఉండాలి.
- ఆన్లైన్లో ఒంటరిగా రూమ్లను బుక్ చేసుకునే మహిళలు, ఆ గదికి వచ్చే విజిటర్స్పై దృష్టి పెట్టాలి.
- మహిళ బుక్ చేసుకున్న గదికి ఒక రోజులో అధిక సంఖ్యలో విజిటర్స్ ఉంటే వెంటనే స్థానిక పోలీసులు లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలి.
- హోటల్స్లో గదులను బుక్ చేసుకునే వారి ఐడీ, ఇతర ధ్రువీకరణ పత్రాలను తీసుకోవాలి.
- ఫోన్ నంబర్లను తీసుకోవాలి.
- గదులను బుక్ చేసుకున్న వారి దగ్గరకు వెళ్లే వారి వివరాలను రిజిస్టర్లో నమోదు చేసుకోవాలి.
- హోటల్స్లో ఉండే అతిథుల వివరాలను ప్రతి రోజూ పోలీస్ స్టేషన్కు పంపాలి.