Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. సాహెబ్నగర్లో డ్రైనేజీ క్లీనింగ్కు దిగి ఇద్దరు కార్మికులు గల్లంతయ్యారు. అంతయ్య, శివ అనే కార్మికులు డ్రైనేజీ శుభ్రం చేసేందుకు మ్యాన్హోల్లోకి దిగారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు, మున్సిపల్, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మ్యాన్హోల్ నుంచి ఒకరి మృతిదేహాన్ని వెలుపలికి తీశారు. మరో కార్మికుడి కోసం గాలింపు చేపడుతున్నారు. అయితే, మ్యాన్హోల్ ఊపిరాడకపోవడంతోనే మృతి చెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.