Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టోక్యో: టోక్యో ఒలింపిక్స్ లో భారత రెజ్లర్లు దీపక్ పూనియా, రవి దహియా లు సెమీస్లోకి ఎంటర్ అయ్యారు. 57 కేజీల మెన్స్ ఫ్రీస్టయిల్ క్వార్టర్స్లో బల్గేరియాకు చెందిన జార్జి వంజెలోవ్పై 14-4 స్కోర్తో రవికుమార్ దహియా విజయం సాధించి సెమీస్లోకి ఎంటర్ అయ్యాడు. ఇవాళ జరిగిన ప్రీక్వార్టర్స్ మ్యాచ్లో కొలంబియా రెజ్లర్ ఆస్కార్ టిగ్రిరోస్పై రవి విజయం సాధించాడు. 23 ఏళ్ల రవికుమార్ తొలిసారి ఒలింపిక్స్లో బరిలోకి దిగాడు. మొదటి మ్యాచ్లో ప్రతి రౌండ్లోనూ రవికుమార్ ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. బౌట్ను 13-2 స్కోర్ తేడాతో దహియా మ్యాచ్ను గెలిచాడు. 57 కేజీల పురుషుల రెజ్లింగ్లో రవికుమార్.. ఆసియా చాంపియన్. వరల్డ్ చాంపియన్షిప్లో బ్రాంజ్ మెడల్ కూడా గెలుచుకున్నాడు. ఆది నుంచి దూకుడు ప్రదర్శించిన దహియా.. కొలంబియా రెజ్లర్ను వత్తిడిలో పెట్టాడు. సెకండ్ పీరియడ్లో టెక్నికల్ సుపీరియార్టీతో మ్యాచ్ను 13-2 తేడాతో కైవసం చేసుకున్నాడు. సెమీస్లో కజికిస్తాన్కు చెందిన నూర్ ఇస్లామ్ సనియోతో రవికుమార్ తలపడనున్నాడు. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2.45కు జరుగుతుంది.