Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మధ్యప్రదేశ్లోని విదిషా జిల్లాలో అమానుషం చోటుచేసుకుంది. ఓ 12 ఏండ్ల బాలికపై దుండగులు లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం చెట్టుకు ఉరేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం బాలిక తల్లి సమీప అడవిలోకి వెళ్లింది. తల్లిని అనుసరిస్తూ ఆమె 12 ఏండ్ల కూతురు కూడా వెళ్లింది. అయితే తల్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి చిన్నారి కనిపించలేదు. దాంతో విషయాన్ని గ్రామస్తులకు చెప్పి అడవిలో బాలిక కోసం గాలించారు. అయితే ఓ చెట్టుకు బాలిక వేలాడుతూ ఉండటాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. బాలికపై లైంగికదాడికి పాల్పడి ఉరేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం.