Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్ సాహెబ్నగర్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సాహెబ్నగర్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పర్యటించారు. అయితే.. ఈ పర్యటనలో టీఆర్ఎస్ -కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరినొకరు నెట్టుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ రేకెత్తింది. ఘెరావ్ చేసిన కాంగ్రెస్ కార్యకర్తలను టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో టీఆర్ఎస్- కాంగ్రెస్ కార్యకర్తలు మరోసారి ఎదురుపడ్డారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాలు మధ్య మళ్లీ తోపులాట జరిగింది. ఘటన స్థలం చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను పోలీసులు అడుకుని వివాదాన్ని సర్ది చెప్పారు.