Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కృష్ణా జలాల వివాదంపై ఆంధ్రప్రదేశ్ దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణలో పిటీషన్ ను సుప్రీంకోర్టు మరో ధర్మాసనానికి బదిలీ చేసింది. సమస్యను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని ఇరు రాష్ట్రాలకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి అనంతరం నిర్ణయం తెలపాలని ఆదేశించారు. సీజేఐ ధర్మాసనమే విచారణ చేపట్టాలని కేంద్రం కోరగా అందుకు జస్టిస్ ఎన్వీ రమణ నిరాకరించారు. మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కారం కాదని ధర్మాసనానికి ఏపీ ప్రభుత్వం తెలిపింది. న్యాయపరమైన పరిష్కారం కోరుకుంటున్నట్లు సీజేఐకి చెప్పింది. మధ్యవర్తిత్వం కోరుకోకపోతే మేం మిమ్మల్ని బలవంతం చేయలేమని సీజేఐ అన్నారు. ఈ మేరకు విచారణను జస్టిస్ సూర్యకాంత్ బెంచ్కు బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.