Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : గుంటూరులో ఓ పుట్టిన రోజు వేడుకల్లో అసభ్య నృత్యాల్లో పాల్గొన్నాడన్న ఆరోపణలపై సీఐపై సస్పెన్షన్ వేటు పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు నగరంలోని ఇన్నర్ రింగు రోడ్డు సమీపంలో ఉన్న ఓ రెస్టారెంట్లో సోమవారం రాకేష్ అనే వ్యక్తి పుట్టినరోజు వేడుకులు జరుపుకు న్నాడు. అందులో భాగంగా అతను తన స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. అలాగే విజయవాడ నుంచి పిలిపించిన ఆరుగురు యువతులు అసభ్య నృత్యాలు చేశారు. ఆర్కెస్ట్రా సౌండ్లు, యువతుల డ్యాన్సులు, యువకులు కేరింతలతో రెచ్చిపోయారు. సమాచారం అందుకున్న పట్టాభిపురం పోలీసులు.. వేడుక పై దాడి చేసి మొత్తం 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కోవిడ్ నిబంధనలు అతిక్రమించటం, అధిక శబ్ధాలతో ఇతరులకు ఇబ్బంది కలిగించడం, దీంతో పాటుగా మద్యం సేవించటం, అసభ్యకరమైన నృత్యాలు చేసినట్టు కేసు నమోదు చేసి, సొంత పూచీకత్తులపై పంపించారు.
ఇదిలా ఉండగా ఆ వేడుకకు అర్బన్ సీసీఎస్లో పని చేస్తున్న సీఐ వెంకటేశ్వర రావు కూడా హాజరయినట్టు ఆరోపణలు వచ్చాయి. దాంతో సీఐ వెంకటేశ్వర్లును సస్పెండ్ చేస్తూ గుంటూరు రేంజ్ ఐజీ తివిక్రమ వర్మ ఆదేశాలు జారీ చేశారు.
అయితే పుట్టిన రోజు వేడుకల్లో రేవ్పార్టీ జరిగిదంటూ ఆరోపణలు వచ్చాయి. అయితే దీనిపై స్పందించి పట్టాభిపురం పీఎస్ సీఐ ఎస్వీ రాజశేఖర రెడ్డి ఎటువంటి రేవ్ పార్టీలు జరగలేదని స్పష్టం చేశారు. తాము అక్కడ జరిగిన తంతుని వీడియో చిత్రీకరించామని, ఎటువంటి అశ్లీల నృత్యాలు జరగలేదని తెలిపారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు అనంతరం కేసు నమోదు చేసినట్టు చెప్పారు.