Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : 29 మంది ఎమ్మెల్యేలతో కర్ణాటక రాష్ర్ట కొత్త క్యాబినెట్ రూపొందింది. అయితే అందులో మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర పేరు అందులో లేకపోవడం షాకింగ్ న్యూస్. కర్ణాటక సీఎం బసవరాజ్ మాట్లాడుతూ 29 మందితో క్యాబెనెట్ రూపొందించామని చెప్పారు. మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందన్నారు. హైకమాండ్తో విస్తృత చర్చలు జరిపిన తర్వాతే కేబినెట్పై నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ జాబితాను గవర్నర్కు పంపించామని తెలిపారు. అయితే హైకమాండ్ నిర్ణయాన్ని అనుసరించి ఉపముఖ్యమంత్రులను ఎంపిక చేయలేదని చెప్పారు. అయితే యడియూర్ప కుమారుడు విజయేంద్ర పేరు జాబితాలో లేదని మాత్రమే చెప్పగలను ఆయన అన్నారు. విజయేంద్రతో కర్ణాటక ఇన్ చార్జిగా ఉన్న అరుణ్ సింగ్ మాట్లాడారని చెప్పారు. యడియూరప్పతోనూ పార్టీ జాతీయ అధ్యక్షుడు మాట్లాడారన్నారు.
క్యాబినెట్ లో 8 మంది లింగాయత్లు, ఏడుగురు ఓబీసీలు, ముగ్గురు ఎస్సీలు, ఏడుగురు ఒక్క లిగలు, ఓ ఎస్టీ, ఓ రెడ్డికి మంత్రివర్గంలో చోటు లభించిందన్నారు. ఓ మహిళను సైతం కేబినెట్లోకి తీసుకున్నామని చెప్పారు.