Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కు తేదీ ఖరారయింది. అక్టోబర్ లోజరగనున్న టీ 20 ప్రపంచకప్ లో ఒకే గ్రూప్ లో ఉండడంతో రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ దాయాదులు అక్టోబర్ 24న పొట్టి ప్రపంచకప్ లో తలపడనున్నట్టు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించింది. దుబాయ్లో ఈ మ్యాచ్ జరగనుంది. ఒమన్, యూఏఈల్లో అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకూ టీ20 వరల్డ్కప్ జరగనుంది. బీసీసీఐ దీన్ని నిర్వహించనుంది. గ్రూప్ 1లో డిఫెండింగ్ చాంపియన్స్ వెస్టిండీస్తోపాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఉన్నాయి. ఇక గ్రూప్ 2లో ఇండియాతోపాటు పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్ ఉన్నాయి. మరో నాలుగు టీమ్స్ క్వాలిఫయర్స్ నుంచి సూపర్ 12కు అర్హత సాధిస్తాయి.