Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వరంగల్- నర్సంపేట ప్రధాన రహదారిలో దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామం వద్ద కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం బోల్తా పడింది. దాంతో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పదిమంది కూలీలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు 108 వాహనం ద్వారా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.