Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : గుజరాత్ సూరత్కు చెందిన వజ్రాల వ్యాపారి సావ్జీ ధోలాకియా..భారత మహిళల హాకీ జట్టుకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఒలింపిక్స్లో పతకం గెలిస్తే.. ఇండ్లు లేని అథ్లెట్లకు తమ సంస్థ తరఫున రూ. 11 లక్షలు ఇస్తామని ప్రకటించారు. అలాగే సొంత ఇల్లు ఉంటే రూ. 5 లక్షలు విలువ చేసే కారు ఇస్తామన్నారు. భారత మహిళల హాకీ జట్టు సెమీఫైనల్ లో అర్జెంటీనా మహిళల హాకీ జట్టుతో నేడు మధ్యాహ్నం 3 : 30 గంటలకు తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో గెలిస్తే ఫైనల్ కు వెళ్తారు. లేదా కాంస్య పతకం కోసం మరో మ్యాచ్ ఆడే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో గుజరాత్ సూరత్కు చెందిన వజ్రాల వ్యాపారి సావ్జీ ధోలాకియా మాట్లాడుతూ భారత మహిళల హాకీ జట్టును ప్రోత్సహించేందుకు వారిని సత్కరించాలని హెచ్కే గ్రూప్ నిర్ణయం తీసుకుందన్నారు. టోక్యో 2020లో మహిళల హాకీ జట్టు తొలిసారిగా ఒలింపిక్స్లో సెమీస్లోకి చేరిందని.. ఇది గర్వించదగ్గ విషయమన్నారు.