Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మంత్రి గంగుల కమలాకర్ కుటుంబానికి చెందిన శ్వేత ఏజెన్సీకి ఈడీ నోటీసులిచ్చింది. బుధవారం కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ అక్రమ రవాణపై 8 గ్రానైట్ ఏజెన్సీ కంపెనీలకు ఈడీ నోటీసులు ఇచ్చింది. అందులో మంత్రి గంగుల కమలాకర్కు చెందిన శ్వేత ఏజెన్సీ కూడా ఉండడంతో జిల్లాలో ఇది ప్రస్తుతం చర్చనియాంశమైంది. తక్కువ పరిణామం చూపి.. ఎక్కువ మోతాదులో గ్రానైట్ ఎగుమతి చేసినట్టు తాజాగా ఈడీకి న్యాయవాదులు బేతి మహేందర్రెడ్డి, గంగాధర్లు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈడీ నోటీసులిచ్చిందని తెలుస్తోంది. ఇక ఈ వ్యవహారంపై ఈడీతో పాటు సీబీఐ కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది