Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పాకిస్థాన్ ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఎంతంటే.. ఏకంగా ప్రధానమంత్రి అధికారిక నివాసాన్నే అద్దెకు ఇవ్వాల్సిన పరిస్థితికి వచ్చింది. సాంస్కృతిక, ఫ్యాషన్, విద్యాపరమైన కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ప్రధాని అధికారిక నివాసాన్ని అద్దెకు ఇవ్వాలని పాక్ క్యాబెనెట్ నిర్ణయించినట్టు అక్కడి మీడియా సంస్థలు చెబుతున్నాయి. ఇందుకోసం రెండు కమిటీలను కూడా ఏర్పాటు చేశరని తెలుస్తోంది.. కార్యక్రమాల నిర్వహణ సమయంలో ప్రధాని అధికారిక నివాస మర్యాదలు, క్రమశిక్షణ నియమావళిని ఉల్లంఘించకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ కమిటీలపై ఉంటుందని తెలుస్తోంది.. ప్రధాని నివాసంలోని ఆడిటోరియం, రెండు గెస్ట్ వింగ్స్, ఒక లాన్ను అద్దెకు ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం.