Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాలుగేండ్ల క్రితం హైకోర్టులో వేసిన పిల్ పై బుధవారం విచారణ ముగిసింది. రేవంత్ రెడ్డి 2016 లో తాగు సాగు నీటి కొరత ఉన్నందున కూల్ డ్రింక్ల తయారీ కోసం నీళ్లు విడుదల చేయవద్దని పిల్ వేశారు. అయితే జాతీయ జల విధానం ప్రకారం పరిశ్రమలకు 10శాతం నీరు కేటాయించవచ్చునని ప్రభుత్వం తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయినందున రాష్ట్రంలో ప్రస్తుతం నీటి కొరత లేదని ప్రభుత్వ న్యాయవాది హెకోర్టుకు తెలిపారు. అలాగే పరిశ్రమలకు నీటి కేటాయింపులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించిందని జలమండలి ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసువెళ్లింది. దాంతో రాష్ట్రంలో ప్రస్తుతం కరవు పరిస్థితులు లేవని రేవంత్ రెడ్డి వేసిన పిల్పై విచారణ అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. సీడబ్ల్యూసీ జాతీయ జల విధానానికి అనుగుణంగానే పరిశ్రమలకు నీరు కేటాయించాలని హైకోర్టు నిర్దేశించి విచారణ ముగించింది.